PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సెయిల్ లో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగువెబ్ : స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న సెయిల్‌ స్టీల్ ప్లాంట్లు/ యూనిట్లు, గనుల్లో మేనేజ్‌ మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఇంజనీరింగ్ డిగ్రీతో పాటు.. గేట్ 2022 అర్హత ఉన్నవారు అర్హులుగా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను https://sail.ucanapply.comసందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు నవంబర్ 23, 2022 లోగా దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 245 మేనేజ్ మెంట్ ట్రైనీ(టెక్నికల్ ) పోస్టులను భర్తీ చేయన్నారు. విభాగాల వారీ ఖాళీ ఇలా ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో 65 పోస్టులు ఉన్నాయి. దీనికి బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు అర్హులు. సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో 16 పోస్టులు, కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో 14, మైనింగ్ ఇంజినీరింగ్ విభాగంలో 26, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ విభాగంలో 13, మెటలర్జికల్ ఇంజినీరింగ్ విభాగంలో 52, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో 59 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఇంజనిరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల యొక్క వయస్సు నవంబర్ 23 నాటికి 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.700 ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

About Author