PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కోర్టుల్లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తెలంగాణ రాష్ట్రంలోని 38 ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను పర్మినెంట్‌ రెగ్యులర్‌ కోర్టులుగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 22ను అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి కోర్టులుగా, మరో 16ను సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులుగా మార్చారు. ప్రజలకు వేగంగా న్యాయం అందించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ను కోరింది. కాగా, మొత్తం 38 కోర్టులకు 1,098 పోస్టులను మంజూరు చేస్తూ సర్కార్‌ మరో జీవో జారీ చేసింది. ఇందులో 22 అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి కేడర్‌ కోర్టుల్లో 682 పోస్టులు, 16 సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టుల్లో 416 పోస్టులు మంజూరయ్యాయి. మరో 14 అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి కోర్టుల్లో 308 కొత్త పోస్టులు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇచ్చింది.

                           

About Author