PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పోలీస్ ప‌హారాలో జోధ్ పూర్.. !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : రాజస్థాన్‌లోని జోధ్ పూర్ లో ఘ‌ర్ష‌ణ‌లు చోటుచేసుకున్నాయి. జలోరి గేట్ ప్రాంతంలో రెండు మతాలకు చెందిన జెండాలు ఎగరేయడం వివాదానికి దారితీసింది. ఇరువర్గాల మధ్య వాగ్వాదం ముదరడంతో ఘ‌ర్ష‌ణ‌లు తలెత్తాయి. మంగళవారం రంజాన్ కాగా.. మూడు రోజులపాటు నిర్వహించే పరశురాం జయంతి పండగ కూడా జోధ్‌పూర్‌లో జరుగుతోంది. దీంతో ఇరు మతాలకు చెందినవారూ నగరంలో జెండాలను పెట్టారని సమాచారం . ఘటనా స్థలంలో జనసందోహాన్ని చెదరగొట్టేందుకు బాష్పవాయు గోళాలను ప్రయోగించినట్టు పోలీసులు తెలిపారు. మంగళవారం వేకువజామున కొంతమంది అల్లరి మూకలు స్థానిక పోలీస్ పోస్ట్‌పై దాడి చేశారు. రాళ్లు రువ్వడంతో నలుగురు పోలీస్ సిబ్బందికి గాయాలయ్యాయి. దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు భారీ మొత్తంలో పోలీసు బలగాలను ఇక్కడ మోహరించారు.

                                                

About Author