PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మాండ్ర సమక్షంలో టిడిపిలో చేరిన వైసీపీ కార్యకర్తలు

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని పీరు సాహెబ్ పేట గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలు టిడిపిలో చేరారు. మంగళవారం మధ్యాహ్నం అల్లూరు గ్రామంలోని నంద్యాల పార్లమెంటు టిడిపి ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి స్వగృహంలో గ్రామ టిడిపి నాయకులు మానంది మహేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలు ఓర్సు ఎల్ల నాగన్న, దండగల కృష్ణ,ఎస్ ముర్తు జావలి,రఫీ,మధు,చిన్ననాయుడు,అల్లి తో పాటు 20 కుటుంబాలు టిడిపి పార్టీలో చేరారు.మాండ్ర శివానందరెడ్డి వీరందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.వచ్చే ఎన్నికల్లో ప్రతి కార్యకర్త టిడిపి అధికారంలోకి రావడానికి కృషి చేయాలని మీ అందరికీ పార్టీ అండగా ఉంటుందని శివానందరెడ్డి కార్యకర్తలకు సూచించారు.తర్వాత జలకనూరు గ్రామానికి చెందిన దళిత కాలనీ వాసులు మాండ్ర శివానందరెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి ఆయన శాలువాలు పూల మాలలతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ కాత రమేష్ రెడ్డి,మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి,ఎస్సీ సెల్ కార్యదర్శి గిత్త జయసూర్య,సుభాన్,గ్రామ టిడిపి నాయకులు మానంది మహేశ్వర రెడ్డి,నాగేశ్వర రెడ్డి,ఆర్ మహేశ్వర రెడ్డి,నాగేశ్వర్ రెడ్డి,డి మహేశ్వర రెడ్డి,పుల్లారెడ్డి,ఎం మహేశ్వర రెడ్డి,ఖాజా హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

About Author