PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టి.జి భరత్ సమక్షంలో… వైసీపీ నుంచి టిడిపిలో చేరిక

1 min read

– కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించిన టిడిపి ఇంచార్జి టి.జి భరత్

– టిడిపి బలోపేతానికి క్షేత్రస్థాయిలో కష్టపడాలన్న టి.జి భరత్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపుకోసం కృషి చేయాలని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. టిడిపి మైనారిటీ టౌన్ ప్రెసిడెంట్ హమీద్ ఆధ్వర్యంలో 1 వ వార్డుకు చెందిన వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. నగరంలోని మౌర్య ఇన్ లో టిడిపి ఇంచార్జి టి.జి భరత్ సమక్షంలో వీరు టిడిపిలో చేరారు. టి.జి భరత్ వీరికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన సలీం ఖాన్, మహబూబ్ ఖాన్, షేక్ నాసిర్ అహ్మద్, జావిద్ ఖాన్, అహ్మద్ ఆలీ ఖాన్, సైఫ్ ఆలీఖాన్ మాట్లాడుతూ టి.జి భరత్ ఆధ్వర్యంలో కర్నూల్లో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కర్నూలు ఎమ్మెల్యేగా టి.జి భరత్ ను గెలిపించుకుంటామని చెప్పారు. టి.జి భరత్ గెలిస్తేనే కర్నూలు అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి ఇంటింటికి తెలుగుదేశం పార్టీని తీసుకెళ్తామన్నారు. అనంతరం టి.జి  భరత్ మాట్లాడుతూ ప్రజల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు పెరుగుతోందన్నారు. వైసీపీ నేతలు టిడిపిలో చేరడం సంతోషించదగ్గ విషయమన్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవాల్సిన అవసరం ఉందన్నారు.

About Author