NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టిజి భరత్ సమక్షంలో టిడిపిలోకి చేరికలు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని వార్డుల్లో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు కర్నూల్ టిడిపి ఇంఛార్జీ టిజి భరత్ చెప్పారు. గురువారం నగరంలోని 6వ వార్డుకు చెందిన బెకారకట్ట వాసులు గౌస్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. మౌర్య ఇన్ లో టిజి భరత్ వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. యువకులను పరిచయం చేసుకొని మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కర్నూల్లో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి అందరం కృషి చేద్దామన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కర్నూలులో తనని ఎమ్మెల్యే చేస్తే స్థానికంగా పరిశ్రమలు తెచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పారు. ప్రజలందరూ ఆలోచించి సరైన నేతను ఎన్నుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జమీర్, చాంద్, బడా, జుబేర్, సమీర్, మాలిక్, షాశావాలి, ఇంతియాజ్, నాగోర్, సలాం, అబ్దుల్లా, తదితరులు పాల్గొన్నారు.

About Author