PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిజి భరత్ సమక్షంలో టిడిపిలోకి చేరికలు

1 min read

– ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలి.. టిజి భరత్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టిజి భరత్ అన్నారు. నగరంలోని 1వ వార్డుకు చెందిన భాస్కర్ బృందం టిజి భరత్ సమక్షంలో మౌర్య ఇన్ లో టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా టీజీ భరత్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం టిజి భరత్ మాట్లాడుతూ అభివృద్ధి కావాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఇక కర్నూల్లో తాము కేవలం ప్రజాసేవ కోసమే రాజకీయాల్లో ఉన్నట్టు చెప్పారు. అభివృద్ధి ఎవరు చేస్తారో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. ఇక పార్టీలో చేరిన ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పని చేయాలని చెప్పారు. రోజురోజుకీ తెలుగుదేశం పార్టీ బలోపేతం అవుతుందన్నారు టీజీ భరత్. ఈ కార్యక్రమంలో వార్డు ఇంచార్జి రమీజ్, ప్రభాకర్, నరసింహులు, సతీష్, సాయి, భరత్, నవనీత్, వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు.

About Author