PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిజి భరత్ సమక్షంలో వైసీపీ నుండి టిడిపిలోకి యువకులు చేరిక

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: బంగారుపేట నివాసుల‌కు బంగారు భ‌విష్య‌త్తు అందించే బాధ్య‌త తాను తీసుకుంటాన‌ని క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భ‌ర‌త్ అన్నారు. న‌గ‌రంలోని 13వ వార్డు బంగారుపేట‌కు చెందిన వైసీపీ నాయ‌కుడు అంజి త‌న అనుచ‌రుల‌తో క‌లిసి టి.జి భ‌ర‌త్ స‌మ‌క్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జనసేన నేత ఆర్షద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టి.జి భరత్ మాట్లాడుతూ ఈ ఐదేళ్ల‌లో ఏం జ‌రిగిందో యువ‌కులు తెలుసుకుంటున్నార‌ని చెప్పారు. ఈ ప్ర‌భుత్వంలో నిత్య‌వ‌స‌ర స‌రుకుల ధ‌ర‌లు, క‌రెంటు చార్జీలు, ప‌న్నులు పెరిగి ప్ర‌జ‌ల‌పై భారం పెరిగింద‌న్నారు. తెలుగుదేశం ప్ర‌భుత్వం వ‌స్తే ప్ర‌జ‌ల‌పై భారం త‌గ్గుతుంద‌న్నారు. ఇక‌ కె.సి కెనాల్‌పై ఉన్న బంగారుపేట వాసుల‌ ఇళ్ల‌ను ఎలాంటి ముంద‌స్తు స‌మాచారం లేకుండా కూల్చివేయ‌డం దారుణ‌మ‌న్నారు. తాను గెలిచిన త‌ర్వాత బంగారుపేట ప్ర‌జ‌ల‌కు న్యాయం చేస్తాన‌ని భ‌ర‌త్ హామీ ఇచ్చారు. పార్టీలో చేరిన వారిలో నాగ‌రాజు, జోగి, మేఘ‌, ప్ర‌సాద్, ర‌వింధ‌ర్, రాంబాబు, త‌దిత‌రులు ఉన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో వార్డు టిడిపి నేత‌లు సురేష్‌, శ్రీనివాస‌రెడ్డి, విఠ‌ల్ శెట్టి, జేమ్స్‌, బూత్ ఇంచార్జీలు, త‌దిత‌ర ముఖ్య నాయ‌కులు పాల్గొన్నారు.

About Author