NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జర్నలిస్టులకు క్రీడలతోనే మానసికోల్లాసం ..

1 min read

ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డా.శంకరశర్మ

కర్నూలు, పల్లెవెలుగు:జర్నలిస్టులకు క్రీడలతోనే మానసిక ఉల్లాసం కలుగుతుందని ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డా.శంకరశర్మ అన్నారు. అనంతపురంలో జరిగే రాష్ట్ర స్థాయి జర్నలిస్టు టోర్నమెంటుకు కర్నూలు జిల్లా పాల్గొంటున్న సందర్భంగా జట్టుకు సభ్యులకు శంకరశర్మ సహకారంతో దుస్తులను పంపిణీ చేశారు. ఆదివారం గాయత్రి ఎస్టేట్లోని క్లినిక్​ లో  జర్నలిస్టులకు ఆయన దుస్తులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం వార్తల బిజిలో ఉండే జర్నలిస్టులకు కాస్త ఉపశమనం కోసం క్రీడలు ఎంతో ముఖ్యమన్నారు. ప్రతి ఒక్కరు ఒత్తిడి లేకుండా సమాజంలో ధైర్యంగా వార్త సేకరణ చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జట్టు సభ్యులు మోహన్, శివరాజ్కుమార్, వెంకటేష్, ప్రకాష్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

About Author