PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సేవ్ జర్నలిజం డే సందర్భంగా విలేకరుల నిరసన

1 min read

– ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేస్తున్న పాత్రికేయులు..

పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: మండల కేంద్రమైన గోనెగండ్లలో ఏపీయూడబ్ల్యూజే మండల కమిటీ ఆధ్వర్యంలో సేవ్ జర్నలిజం డే ను పురస్కరించుకొని గాజుల దిన్నెలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ అంబేద్కర్ విగ్రహానికి జర్నలిస్టుల హక్కులు పరిరక్షించాలని, పత్రికా స్వేచ్ఛను పరిరక్షించాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే మండల అధ్యక్షులు అక్బర్, మండల ఉపాధ్యక్షులు కరుణాకర్, తెలుగు యువత మాజీ జిల్లా ఉపాధ్యక్షులు మరియు బీసీ విద్యార్థి సంఘం జాతీయ కార్యదర్శి రామకృష్ణ లు మాట్లాడుతూ పత్రికలు సమాజ మార్పు కోసం ఎల్లవేళలా అహర్నిశలు కృషి చేస్తున్నాయని పత్రికా స్వేచ్ఛను పరిరక్షించాలని, అలాగే వర్కింగ్ జర్నలిస్టులందరికీ మూడు సెంట్ల స్థలం, ఉచిత బీమా ప్రభుత్వం ఉచితంగా అందజేయాలని అలాగే జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాలల్లో ఉచిత విద్య అందజేయాలని, జర్నలిస్టుల కుటుంబాలకు ఉచిత వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల విలేకరులు మధు, కిరణ్, అక్బర్,ఈశ్వర్ ,ఖలీల్ ,షఫీ, బాబు నాయుడు, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.

About Author