PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మానసిక వికలాంగుల వార్డును  పరిశీలించిన న్యాయమూర్తి

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గౌరవనీయులైన శ్రీ ఎన్. శ్రీనివాస రావుఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీ సి.హెచ్.వెంకట నాగ శ్రీనివాస రావు  ఈ రోజు అనగా 19-07-2023 న దిశ వన్ స్టాప్ కేంద్రం, మానసిక వికలాంగుల వార్డును కర్నూలు ను తనిఖీ చేశారు. కార్యాలయాలకు సంబందించిన రిజిస్టర్ లను పరిశీలించి, అక్కడి సౌకర్యాలు, పరిశుభ్రతను పరిశీలించి వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకొన్నారు, ఏవైనా లోపాలు ఉంటే వాటి మీద అవసరమైన చర్యలు తీసుకోవడానికి సంబంధిత ఉన్నత అధికారుల దృష్టికి తీసుకొనివేళతాము అని తెలియజేశారు. అక్కడ ఉన్న మహిళలకు, మానసిక వికలాంగులకు లీగల్ సర్వీసెస్ ఆక్ట్ 1987 ద్వారా ఉచిత న్యాయ సహాయంను పొందుటకు అర్హులని తెలిపారు.  ఈ కార్యక్రమంలో కార్యదర్శి శ్రీ సి.హెచ్.వెంకట నాగ శ్రీనివాస రావు గారు, సైకియాట్రిక్ డా. నాగేశ్వర రావు గారు, తదితరులు పాల్గొనారు.

About Author