NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జూనియర్ కాలేజ్  కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్డ్ చేయాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ విజయవాడ:  జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను వెంటనే కనుబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలి అని కోరుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి కాంట్రాక్టు లెక్చరర్ సంఘం నాయకులు గార్ల మాణిక్యం, కామాలు శేషగిరి విజ్ఞప్తి చేశారు. స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లోజరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఇప్పటికే వైద్య ఆరోగ్య, ట్రైబల్ శాఖలలో, రెగ్యులరైజ్ ఉత్తర్వులు ఇచ్చారని తెలిపారు. విద్యా శాఖలో జూనియర్ కాలేజీలలో ఏ ఒక్కరికి ఉత్తర్వులు ఇంకా విడుదల చేయకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవైపు ఇంటర్ పరీక్షలు, ఒత్తిడి మరోవైపు ఎలక్షన్ కోడ్, ఒత్తిడిలో సతమతమై పోతున్నామని వారు చెప్పారు. వెంటనే మా పోస్టులను రెగ్యులర్ చేసి నెట్ అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎంతో రుణపడి ఉంటామని వారన్నారు. ఈ కార్యక్రమంలో పరస వీణమ్మ, ఎం నిర్మల ,శివాజీ, దేవానందం శ్యామ్ కిరణ్ ,రాజు తదితరులు పాల్గొన్నారు.

About Author