NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎమ్మార్వో కార్యాల‌యంలో జూనియ‌ర్ ఎన్టీఆర్ !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ప్రముఖ టాలీవుడ్ న‌టుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ రంగారెడ్డి జిల్లా శంక‌ర‌ప‌ల్లిలో సంద‌డి చేశారు. ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో బిజిగా ఉన్న ఎన్టీఆర్.. శంక‌ర ప‌ల్లి ఎమ్మార్వో కార్యాల‌యానికి రావ‌డంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. శంక‌ర‌ప‌ల్లి ప‌రిధిలోని గోపాల‌పురం లో ఆరున్నర ఎక‌రాల వ్యవ‌సాయ భూమిని ఎన్టీఆర్ కొనుగోలు చేశారు. ఈ భూమి రిజిస్ట్రేష‌న్ కోసం ఎన్టీఆర్ శంక‌ర‌ప‌ల్లి ఎమ్మార్వో కార్యాల‌యానికి చేరుకున్నారు. దీంతో అక్కడికి భారీగా అభిమానులు చేరుకున్నారు. అభిమానుల‌తో ఎన్టీఆర్ ఫోటోలు కూడ దిగారు. రిజిస్ట్రేష‌న్ పూర్తవ‌గానే ఆయ‌న హైద‌రాబాద్ వెళ్లారు.

About Author