PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నూతనంగా లోకాయుక్త వెబ్సైట్ ను ప్రారంభించిన జస్టిస్ పి.లక్ష్మణ రెడ్డి

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: లోకాయుక్త కార్యాలయానికి సంబంధించి అధికారిక వెబ్సైట్ ను జస్టిస్ పి.లక్ష్మణ రెడ్డి ప్రారంభించారు. బుధవారం లోకాయుక్త కార్యాలయంలో అధికారిక వెబ్సైట్ ను జస్టిస్ పి.లక్ష్మణ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్ పి.లక్ష్మణ రెడ్డి మాట్లాడుతూ లోకాయుక్త కార్యాలయానికి సంబంధించి అధికారిక వెబ్సైట్ ను ప్రారంభించడం జరిగిందని, గతంలో ఉమ్మడి రాష్ట్రాలకు సంబంధించి ఒకే అధికారిక వెబ్సైట్ ఉండేదని, కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ప్రత్యేకంగా వెబ్సైట్ ఏర్పాటు చేసి ఈ రోజు అధికారికంగా ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ వెబ్సైట్ లో లోకాయుక్త కు సంబంధించి నియమ నిబంధనలు గురించి పూర్తి స్థాయిలో వివరాలు ఉంటాయని వివరించారు. దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో లోకాయుక్త సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author