NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బ్రాహ్మణ విద్యార్థులకు న్యాయం చెయ్యాలి…

1 min read

ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య డిమాండ్

కర్నూలు, న్యూస్​ నేడు:  కర్ణాటక రాష్ట్రం లో బీదర్ మరియు షిమోగా తదితర పట్టణం లలో జరిగిన సెట్ పరీక్ష సెంటర్ ల వద్ద పరీక్ష కు హాజరు అయిన బ్రాహ్మణ విద్యార్థుల పట్ల అమానుషం గా ప్రవర్తన తో గాయత్రి మాత స్వరూపం అయిన యగ్నోపవీతం లను కత్తిరించి డస్ట్ బిన్ లలో వేయడం అత్యంత దారుణం అని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్ కె మనోహర రావు తీవ్రంగా ఖండించారు. కర్నూలు నగరం లో సమాఖ్య కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతు హిందూ సనాతన ధర్మం యొక్క ప్రతినిధులు అయిన బ్రాహ్మణ విద్యార్థుల పట్ల,  అనైతిక విధంగా హిందూ మత వ్యతిరేక ధోరణి తో బ్రాహ్మణ విద్యార్థులు పరీక్షలకు హాజరు కాకుండ చేసే కుట్ర గా కనిపిస్తుంది అని అన్నారు.కర్ణాటక ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ విషయం అయి న్యాయ విచారణ జరిపించి తప్పు చేసిన వారిని కఠినం గా శిక్షించి, యగ్నోపవితం తీస్తున్నారుఅని భయం తో పరీక్ష కు హాజరు కాని విద్యార్థులకు,యగ్నోపవీతం తొలగించబడి వేదన తో పరీక్ష రాయలేని విద్యార్థులకు తిరిగి పరీక్ష నిర్వహించాలి. అని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమం లో సమాఖ్య నాయకులు  ఉపాధ్యక్షులు ఇస్కాల సురేష్ కుమార్, ఆర్గనైజేషన్ కార్యదర్శి కల్లె చంద్రశేఖర్ శర్మ, మెంబర్​ షిప్​ కన్వీనర్,హెచ్ కె రాజశేఖర్, యువజన విభాగం ఉపాధ్యక్షులు సుందర రామశర్మ,కార్యవర్గ సభ్యులు దుర్గాప్రసాద్, శ్రీనాథ్, దేవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

About Author