NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిల్లా యాదవ సంఘం ఆధ్వర్యంలో జ్యోతి రావు పూలే జయంతి

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల : దుర్వేసి గ్రామంలో టిడిపి బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు అంగజాల కృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో మంగళవారం నాడు మహాత్మ జ్యోతి రావు పులే జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం అంగజాల శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ. భారతదేశానికి చెందిన ప్రముఖ సంఘ సంస్కర్త, ఆలోచనాపరుడు. భారతదేశంలో ఉన్న కుల నిబంధనలకు వ్యతిరేకంగా ఉద్యమానికి నాయకత్వం వహించాడని అతను బ్రాహ్మణుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి మరియు రైతులు, ఇతర తక్కువ కులాల ప్రజల హక్కుల కోసం పోరాడిన మహానియుడని మహాత్మా జ్యోతిబా ఫూలే భారతదేశంలో మహిళా విద్యకు మార్గదర్శకుడు, తన జీవితాంతం బాలికల విద్య కోసం పోరాడారు. అభాగ్యులైన పిల్లల కోసం అనాథాశ్రమాన్ని ప్రారంభించిన మొదటి హిందువుగా ఆయన విశ్వసిస్తారు. జ్యోతిబా ఫూలే తన జీవితమంతా బ్రాహ్మణుల దోపిడీ నుండి అంటరానితనం విముక్తి కోసం అంకితం చేశారని కొనియాడారు ,ఈ కార్యక్రమంలో అంగజాల శ్రీనివాసులు యాదవ్ మరియు బీసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author