NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బిజెపి ప్యాపిలి మండల అధ్యక్షుడు గా కే. బి. దామోదర్ నాయుడు

1 min read

పల్లెవెలుగు వెబ్  ప్యాపిలి : ప్యాపిలి మండలం లోని చంద్రపల్లి గ్రామానికి చెందిన కే. బి. దామోదర్ నాయుడు భారతీయ జనతా పార్టీ ప్యాపిలి మండలం అధ్యక్షుడి గా రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు.నంద్యాల బిజెపి జిల్లా అధ్యక్షులు బైరెడ్డి శభరి  ఆదేశాల మేరకు గురువారం పట్టణంలో ఏర్పాటు చేసిన బిజెపి కార్యకర్తల సమావేశం లో కే. బి. దామోదర్ నాయుడు ని రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అనంతరం దామోదర్ నాయుడు మాట్లాడుతు మండలంలోని గ్రామాలలో నిత్యం పర్యటిస్తూ అధికార ప్రతిపక్షపార్టీలకు దిటుగా బిజెపి పార్టీ ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తానని అలాగే తనను నమ్మి పార్టీ మరోసారి మండల అధ్యక్ష పదవి ఇచ్చినందుకు వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండ, పార్టీని బలోపేతం చేయడం తో పాటు, కార్యకర్తలకు అండగా ఉంటు,పార్టీలో కీలకంగా వ్యవహారిస్తామన్నారు.అంతే కాకుండ 2024సంవత్సరని కి మండలంలోని ప్రతి గ్రామంలో భారతీయ జనతా పార్టీ జండా ఎగురు వేస్తామన్నారు.ఈ ఎన్నిక పట్ల పలువురు బిజెపి నాయకులు హార్షం వ్యక్తం చేశారు.

About Author