PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్ పోటీలకు కే హమీద్ ఎంపిక 

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: ఈనెల 22 నుండి 25 వరకు కర్ణాటక రాష్ట్రంలోని విశ్వేశ్వరయ్య టెక్నాలజీ విశ్వవిద్యాలయంలో నిర్వహించే ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్ పోటీలకు పత్తికొండకు చెందిన క్రీడాకారుడు కే హమీద్ ఎంపికయ్యారు.   పత్తికొండ క్రీడాకారుడు కె. హమీద్ అనంతపురం, సత్యసాయి జిల్లా బుక్కపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీ.ఎ రెండవ సంవత్సరం చదువుతున్నారు. క్రీడాకారుడు ప్రత్యేక ప్రతిభ కనబరిచి సౌత్ జోన్ కు వాలీబాల్ పోటీలకు ఎంపిక కావడం పట్ల  తల్లిదండ్రులు కే.హుస్సేన్ తల్లి కె. ముంతాజ్ బేగం హర్షం వ్యక్తం చేశారు. ఆర్గనైజింగ్ కళాశాల ఆఫ్ ఇంజినీరింగ్ మాండ్యాలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మరియు స్పోర్ట్స్ కర్ణాటక రాష్ట్రంలో  ఆడడం జరుగుతుందని వాలీబాల్ సీనియర్ కోచ్ మధు అంబోజీరావు తెలిపారు. పత్తికొండ క్రీడాకారుడు  కే .హమీద్ ఇంటర్  యూనివర్సిటీ వాలీబాల్ పోటీలకు ఎంపిక కావడం పట్ల వాలీబాల్  అసోసియేషన్ నాయకులు బ్రహ్మయ్య రిటైర్డ్ పి.డి, ఈ.రామాంజనేయులు, వాలీబాల్ ఏ.పీ  స్టేట్  రెఫరీ యు.ధంజయ కే.వి.కే స్టేడియం వాలీబాల్  కోచ్ సీనియర్ క్రీడాకారులు మధు అంబోజీరావు, గంగాధర్, మహమ్మద్, డి.శ్రీను, వీ.రాజు, వినోద్ కుమార్, హరికుమార్ హర్షం వ్యక్తం చేశారు.

About Author