PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మాఫియా కేంద్రంగా క‌డ‌ప : శ్రీనివాసుల రెడ్డి

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సీఎం జగన్ ప్రభుత్వంపై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసుల రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. సీఎం సొంత జిల్లా కడపను వైసీపీ నాయకులు మాఫియా కేంద్రంగా మార్చేశారని ఆరోపించారు. మైనింగ్, మట్టి, ఇసుక మాఫి‌యాకు పాల్పడి కోట్లు దండుకుంటున్నారని, ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరు‌డు భరత్ రెడ్డి కొండను కరిగించి మట్టి మాఫియాకు పాల్పడుతున్నారని విమర్శించారు. ‘‘నగర శివారులోని చలమారెడ్డి పల్లెలో జరిగిన మైనింగ్ మాఫి‌యాపై టీడీపీ బృందం ఫిర్యాదు చేయడంతో అక్రమాలు వెలుగు‌లోకి వచ్చాయి. ఎంత మేర మట్టి తోడేశారో మైనింగ్ అధికారులు సర్వే చేయలేదు. తూతూ మంత్రంగా సర్వే చేసి రూ. 2 కోట్లు పెనాల్టీ వేశారు. సమగ్రంగా సర్వే చేస్తే రూ. 10 కోట్ల మేర ఆదాయానికి గండికోట్టి‌నట్లు బట్టబయలవుతుంది. ఇసుకను దొంగతనంగా తరలించి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. ఫలితంగా ఇల్లు కట్టుకోనే పేదలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కోడుతుంటే.. మైనింగ్ అధికారులు చోద్యంచూస్తున్నారు’’ అని శ్రీనివాసుల రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

                                             

About Author