PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క‌డ‌ప జిల్లా.. బాలిక పై సామూహిక అత్యాచారం

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరులో ఎస్సీ బాలికపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మార్కెట్‌ దగ్గర బాలికపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ కామాంధుల వల్ల ఆ బాలిక గర్భం దాల్చింది.. ప్రస్తుతం ఆమె 6 నెలల గర్భిణి. విషయం తెలిసినా పోలీస్ అధికారులు కేసు నమోదు చేయలేదు. స్థానికుల సమాచారంతో బాలికను ఎంఎస్‌కేలు విచారించారు. 10 మంది యువకులు తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు బాలిక తెలిపింది. విషయాన్ని వీడియో తీసి ప్రొద్దుటూరు సీఐ నాగరాజు దృష్టికి ఎంఎస్‌కేలు తీసుకెళ్లారు. విషయం బయటకు పొక్కకుండా బాలికను మరో చోటికి తరలించాలని సీఐ ఆదేశించారు. బాలికను ఇస్లాపురం నుంచి అమృతనగర్‌కు ఎంఎస్‌కేలు పంపారు.

                                   

About Author