PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కడప జైలు ఇంచార్జీ సూపరింటెండెంట్ వరుణ్​ రెడ్డి బదిలీ

1 min read

పల్లెవెలుగువెబ్ : కడప జైలు ఇంచార్జి సూపరింటెండెంట్ వరుణ్ రెడ్డి బదిలీ అయ్యారు. వరుణ్ రెడ్డిని ఒంగోలు జైలర్ గా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో ఒంగోలు జైలు సూపరింటెండెంట్ ప్రకాశ్ ను నియమించింది. పది రోజుల క్రితమే వరుణ్ రెడ్డి కడప జైల్ ఇంచార్జి బాధ్యతలు తీసుకున్నారు. టీడీపీ నేత పరిటాల హత్య కేసు నిందితుడు మొద్దు శీను హత్య సమయంలో అనంతపురం జైలు సూపరింటెండెంట్ గా వరుణ్ ఉన్నారు. ఆ సమయంలో వరుణ్ రెడ్డి శాఖాపరమైన శిక్షకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు కడప జైలు ఇంచార్జీగా వరుణ్ రెడ్డిని నియమించడం పై ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు కడప జైల్లో ఉన్న నేపథ్యంలో వరుణ్ రెడ్డిని నియామకంపై టీడీపీ ఆందోళన చేసింది. దీంతో వరుణ్ రెడ్డిని బదిలీ చేసినట్టు తెలుస్తోంది.

             

About Author