PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వాస‌వి క‌న్య‌కా ప‌ర‌మేశ్వ‌రీ క‌ల‌శ యాత్ర ప్రారంభించిన టి.జి భ‌ర‌త్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  క‌ర్నూలు న‌గ‌రంలో వాస‌వి క‌న్య‌కా ప‌ర‌మేశ్వ‌రీ దేవి క‌ల‌శ యాత్ర వైభ‌వంగా జ‌రిగింది. రాంబొట్ల దేవాల‌యం వ‌ద్ద నుండి చిన్న అమ్మ‌వారిశాల వ‌ర‌కు ఈ యాత్ర సాగింది. క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భ‌ర‌త్.. రాంబొట్ల దేవాల‌యం వ‌ద్ద ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి ఈ క‌ల‌శ యాత్ర‌ను ప్రారంభించారు. అమ్మ‌వారి దీవెన‌లు క‌ర్నూలు ప్ర‌జ‌ల‌పై ఎల్ల‌ప్పుడూ ఉండాల‌ని టి.జి భ‌ర‌త్ అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ల‌లితా పీఠం సుబ్బుస్వామి, భ‌క్తులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

About Author