PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క‌ళ్యాణ‌దుర్గం.. వేధింపుల‌తో బాలిక ఆత్మ‌హ‌త్య‌

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : యువకుల వేధింపులు తాళలేక 16ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. కళ్యాణదుర్గం మండలం దురదకుంట గ్రామంలో ఓ బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ముగ్గురు యువకులు ఇంటి ముందు అటూ ఇటూ తిరుగుతూ వేధింపులకు గురి చేశారు. యువకుల వేధింపులపై ఫిర్యాదు చేసినా కళ్యాణదుర్గం పోలీసులు పట్టించుకోని పరిస్థితి. ఈ క్రమంలో తీవ్రమనస్థాపానికి గురైన బాలిక…. తల్లి పెళ్లికి, తండ్రి బయటకు వెళ్లిన సమయంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతోనే కూతురు ఆత్మహత్య చేసుకుందంటూ తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు.

                                    

About Author