PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అలాంటి వారికే క‌ళ్యాణ‌మ‌స్తు వ‌ర్తింపు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: ఏపీ సీఎం జగన్ ఇవాళ మహిళా శిశు సంక్షేమపై సమీక్ష నిర్వహించారు. బాల్య వివాహాల అంశంపై ఈ సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో బాల్య వివాహాల నివారణలో కల్యాణమస్తు పథకం ప్రత్యేక పాత్ర పోషించేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎం జగన్ చెప్పారు. అందులో భాగంగానే, ఈ పథకం కింద లబ్ది పొందాలనుకునే వధువు, ఆమెను పెళ్లిచేసుకునే వరుడు తప్పనిసరిగా టెన్త్ క్లాస్ పాసై ఉండాలన్న నిబంధన తీసుకువచ్చామని వెల్లడించారు. రాష్ట్రంలో బాల్య వివాహాలను పూర్తిగా నివారించడంపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.

                                           

About Author