PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహానందిలో కంచి పీఠాధిపతి చే  నిశ్చితార్థ మంటపానికి శంకుస్థాపన

1 min read

పల్లెవెలుగు వెబ్ మహానంది: మహానంది క్షేత్రంలో సోమవారం కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి చేతుల మీదుగా నిశ్చితార్థ మంటపానికి శంకుస్థాపన గావించారు. ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా  గత కొన్ని మాసాల క్రితం పురాతన నిశ్చితార్థ మంటపాన్ని తొలగించడం జరిగింది. ఈ ప్రాంతంలో మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా జరిగే స్వామి అమ్మవార్ల కళ్యాణంలో భాగంగా ఇరువురి తరపున పెళ్లి పెద్దల సమక్షంలో నిశ్చితార్థ కార్యక్రమం ఆచార వ్యవహార లు గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడినుండే నిర్వహిస్తుండేవారు. నిశ్చితార్థం మండపం అయిన పురాతన నిర్మాణం తొలగించడంతో నూతన నిర్మాణాన్ని విజయేంద్ర సరస్వతి చేత శంకుస్థాపన చేయించారు. ఈ కార్యక్రమం కంటే ముందు క్షేత్రంలోని కళ్యాణమండపం లో కంచి కామకోటి పీఠాధిపతి పిఠానికి ప్రత్యేక పూజలను భక్తుల సమక్షంలో నిర్వహించారు. ఆలయంలో కూడా ప్రత్యేక పూజలను పీఠాధిపతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి మహానంది దేవస్థానం వేద పండితులు రవిశంకర్ అవధాని, నాగేశ్వర శర్మ, శాంతారాం భట్ కంచి కామకోటి పీఠం నుండి వచ్చిన పలువురు అవధానులు మహానంది దేవస్థానం ఏఈవోలు మధు ,వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. 

About Author