PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అక్రమ కర్ణాటక మద్యం పట్టివేత

1 min read

– ఇద్దరు వ్యక్తులు అరెస్టు

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం:  కర్ణాటక నుండి అక్రమంగా తరలిస్తున్న మద్యం బాక్స్ లను పట్టుకుని ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన సంఘటన మండల పరిధిలోని మాధవరం చెక్ పోస్టు వద్ద ఆదివారం చోటు చేసుకుంది. మాధవరం ఎస్సై కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని వగరూరు గ్రామానికి చెందిన మైనుద్దీన్, చాంద్ బాషా ఇద్దరు వ్యక్తులు  ఏపి 21 డి 6804 బాక్సర్ బైక్  పై కర్ణాటక రాష్ట్రానికి చెందిన 480 (ఐదు  బాక్సుల) 90 యం ఎల్ ఒరిజినల్ ఛాయిస్ విస్కీ టెట్రా పాకెట్స్ ను అక్రమంగా తీసుకుని వస్తుండగా చెక్ పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించి మద్యం ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించి బైక్ ను సీజ్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ తనిఖీల్లో కానిస్టేబుళ్లు వీరాంజనేయులు,  భాస్కర్, సెబ్ హెడ్ కానిస్టేబుల్ షరీఫ్ లు ఉన్నారు.

About Author