PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్తవ్య దీక్షకు మద్దతు తెలిపిన కురువ సంఘం నాయకులు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: స్థానిక ఎస్టీ బీసీ కాలేజీ మైదానంలో సోమవారం జరిగిన రాయలసీమకు నీళ్లు, నిధులు, ఉద్యోగ నియామకాలు విషయంపై కర్తవ్య దీక్ష పేరుతో చేపట్టిన కార్యక్రమం లో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తోపాటు పాలుపంచుకున్న కర్నూలు జిల్లా కురువ సంఘం ప్రధాన కార్యదర్శి ఎం .కే . రంగస్వామి కోశాధికారి కే. సి .నాగన్న ,నగర అధ్యక్ష ,కార్యదర్శి తవుడు శ్రీనివాసులు ,బి .రామకృష్ణ ,RVPS రాష్ట్ర అధ్యక్షులు రవికుమార్ తో పాటు కురువ సంఘం నాయకులు దీక్షలో పాల్గొన్నారు. అనాదిగా రాయలసీమకు అన్యాయం జరుగుతుందని ఎన్నోసార్లు మొరపెట్టుకున్న పట్టించుకోని పాలకులు రాయలసీమ నుంచే ఎన్నికైన ముఖ్యమంత్రి రాయలసీమ బాగు పరచిన పాపాన పోలేదని ఒక వ్యక్తి ఒక పదవిలో ఉన్నప్పుడు తన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఆకాంక్ష ఉండాలి కానీ నేటికీ 9 మంది రాయలసీమ నుంచి ముఖ్యమంత్రులు అయినప్పటికీ రాయలసీమకు రావాల్సిన నీళ్లు, నిధులు, ఉద్యోగ నియామకాలు ఒక్క ముఖ్యమంత్రి కూడా పట్టించుకోకపోవడం విచారకరమని, అందుకుగాను కర్నూలు జిల్లా కురువ సంఘం తరఫున పూర్తి మద్దతు తెలిపినట్లు వారు తెలిపారు.

About Author