PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కార్తీక సోమవారం… దుర్గ భోగేశ్వరంలో భక్తుల సందడి..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  కార్తీక మాసం మొదలై మొదటి సోమవారం సందర్భంగా గడిగిరేవుల గ్రామం వద్ద వెలసిన శ్రీ దుర్గా భోగేశ్వర స్వామి ఆలయంలో భక్తులు తెల్లవారుజామున నుండి స్వామివారి దర్శనానికి పోటెత్తారు కోనేరులో పుణ్య స్నానాలు ఆచరించి భక్తులు ఆలయ ఆవరణలో కార్తిక దీపాలు వెలిగించారు అనంతరం స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు ఆలయ చైర్మన్ సునీల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు స్వామివారికి పల్లకి సేవ ప్రత్యేక పూజలు కుంకుమార్చన ఆకు పూజలు నిర్వహించారు. భక్తులకు సకల సౌకర్యాలను ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లను చేశారు వచ్చేనెల 14వ తేదీ వరకు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు . భక్తులు స్వామి వారి సేవలో పాల్గొనాలని ఈ సందర్భంగా  ఈవో తెలిపారు  స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు కాశిరెడ్డి నాయన ఆశ్రమం వారు ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు .

About Author