PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

11న బ్రాహ్మణ సంఘం.. కార్తీక మాస సమారాధన

1 min read

పల్లెవెలుగు, కర్నూలు: నగరంలోని బ్రాహ్మణ కుల కార్తీక వన భోజన కార్యక్రమాన్ని ఈ నెల 11న నిర్వహించనున్నారు. ఈ మేరకు గురువారం  నగరంలోని దేవిఫంక్షన్​ హాల్​లో  బ్రాహ్మణ సేవా సంక్షేమ మిత్ర మండలి, ఆపన్న ప్రదీపన బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య గాయత్రి బ్రాహ్మణ సంఘం వారు సంయుక్తంగా  ప్రకటన విడుదల చేశారు. బ్రాహ్మణ బంధువులందరూ కార్తీక మాసం సమారాధన కార్యక్రమానికి విచ్చేయాలని కోరారు.ఈ కార్యక్రమములో ,    గౌరవ సభ్యులు శ్రీ చంద్రమౌళి గారు రిటైర్డ్ ఎస్పీ హోం గార్డ్స్ , శ్రీ పసుపుల మురళి కృష్ణ ఎంపీటీసీ సండేల్ చంద్రశేఖర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కంచు గంటల శ్యామ్ సుందర్ రావు, రాష్ట్ర కార్యదర్శి,       కె చంద్రశేఖర, రాష్ట్ర గౌరవ సలహాదారు,  నాగులవరం రాజశేఖర్,జిల్లా అధ్యక్షుడు, చల్లా నాగరాజ శర్మ, జిల్లా కార్యదర్శి, దావనగెరి ఆనందరావు,యువజ అధ్యక్షుడు,   కే, నరేష్ సత్యం పాల్గొన్నారు.

About Author