PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కార్తీక పూజలు

1 min read

పల్లెవెలుగు, వెబ్​ రుద్రవరం: మండల కేంద్రమైన రుద్రవరం సమీపంలో వెలగలపల్లె గ్రామ పొలిమేరలో వెలసిన శ్రీ వాసాపురం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో శనివారం భక్తులు ఘనంగా కార్తిక పూజలు నిర్వహించారు. కార్తీక మాసాన్ని పురస్కరించిన మొదటి శనివారం కావడంతో వెలగలపల్లె కొండమాయపల్లె రుద్రవరం గ్రామాలతోపాటు సమీప గ్రామాలు సిరివెళ్ల నంద్యాల తదితర ప్రాంతాల నుండి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయ పూజారి వారణాసి గోపిశర్మ వేదమంత్రోచ్ఛారణలతో స్వామివారికి దీప దూప. నైవేద్యాలు సమర్పించి విశేష పూజలు అందించారు. ఉదయం నుండి రాత్రి వరకు శ్రీ వాసాపురం వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు ఘనంగా పూజలు నిర్వహించారు. రాత్రి ఆలయ ప్రాంగణంలో భక్తులు కార్తిక దీపాలను వెలిగించారు. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు నిర్వాహకులు అల్పాహారం త్రాగునీరు వంటి సౌకర్యాలు కల్పించారు.

About Author