PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బాక్సాఫీస్ షేక్ చేస్తోన్న `కార్తికేయ‌-2` !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నిఖిల్, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కార్తికేయ 2’. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బేన‌ర్స్ పై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్‌ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం తొలి రోజే హిట్‌టాక్‌ సంపాదించుకుంది. దీంతో బాక్సాఫీస్‌ వద్ద ఈ చిత్రం దూసుకెళ్తోంది. ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో థియేటర్స్‌ లభించనప్పటికీ.. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.8.50 కోట్ల గ్రాస్‌, రూ.5.05 కోట్ల షేర్‌ వసూళ్లని రాబట్టింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు రూ.5.30 కోట్ల గ్రాస్‌, రూ.3.50 కోట్ల షేర్‌ కలెక్షన్స్‌ని రాబట్టి.. నిఖిల్‌ కెరీర్‌లోనే ఫస్ట్‌డే అత్యధిక కలెక్షన్స్‌ రాబట్టిన చిత్రంగా ‘కార్తికేయ2’ నిలిచింది.

                                     

About Author