PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కశ్మీర్ పండిట్ ను కాల్సి చంపిన ఉగ్రవాదులు

1 min read

పల్లెవెలుగువెబ్ : జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. కశ్మీరీ పండిట్లను టార్గెట్ గా చేసుకుని వారు దాడులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. ఈరోజు మరోసారి దాడికి తెగబడ్డారు. పురాణ్ కృష్ణన్ అనే కశ్మీరీ పండిట్ ను కాల్చి చంపారు. షోపియాన్ జిల్లాలోని చౌదరి గుండ్ ఏరియాలో ఆయన ఇంటి వద్దే చంపేశారు. సమాచారం అందిన వెంటనే భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. టెర్రరిస్టుల కోసం గాలిస్తున్నాయి. పురాణ్ కృష్ణన్ కు భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఇంటి నుంచి ఆయన ఎక్కువగా బయటకు వచ్చేవారు కాదని స్థానికులు తెలిపారు. ఎక్కువగా ఇంట్లోనే గడిపే వారని చెప్పారు. ఆయన హత్యతో బంధువులు భయాందోళనలకు గురవుతున్నారు.

                  

About Author