PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పోటీల్లో కస్తూర్బా బాలికలు రెండవ స్థానం

1 min read

పల్లెవెలుగు, వెబ్ మిడుతూరు:మిడుతూరు మండల కేంద్రంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో చదువుతున్న బాలికలు 7వ జిల్లా స్థాయిలో జరిగిన ఆట్యా పాట్యా ఆటల పోటీలలో కస్తూర్బా బాలికలు ఉన్నత ప్రతిభను చాటుకున్నారు.కర్నూలులోని అవుట్ డోర్ స్టేడియంలో జరిగిన ఈఆటల పోటీలలో మొత్తం 8 జట్లు పాల్గొన్నాయని వీటిలో రెండవ స్థానంలో బాలికలు గెలుపొందారు.ఈపోటీల్లో గెలుపొందిన కస్తూర్బా బాలికలు అశ్విని,దివ్య, శ్రీవిద్య,సురేఖ,రాణి,హరిణి సంధ్యారాణి,కళ్యాణి, మంజుల,అర్షియా,దీపిక,రుక్సానా ఈపోటీల్లో పాల్గొన్నారు.అంతేకాకుండా రాష్ట్రస్థాయి ఇదే ఆటల పోటీలకు గాను ఆరుగురు బాలికలు ఎంపిక అయ్యారు. అశ్విని,దివ్య,హరిణి,కళ్యాణి,దీపిక,అర్సియా ఎంపిక అయ్యారని పాఠశాల ప్రత్యేక అధికారి ఉమా గైర్వాణి,పిఈటి సుమలత తెలియజేశారు.

About Author