PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జంప్ రోప్ లో కస్తూర్బా విద్యార్థుల ప్రతిభ

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మండల కేంద్రమైన కస్తూర్బా గాంధీ విద్యాలయంలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు జంప్ రోప్ ఆటల పోటీలలో ఉన్నత ప్రతిభను కనబరచినట్లు పాఠశాల ఎస్ఓ విజయలక్ష్మి,పిఈటి సుమలత తెలిపారు.ఈనెల 9 మరియు 10వ తేదీలలో గుంటూరులోని తెనాలిలో జంప్ రోప్ అసోసియేషన్ నాలుగవ సబ్ జూనియర్ ఇంటర్ 2023-2024 చాంపియన్షిప్ మూడు నిమిషాల సైక్లింగ్ ఈవెంట్ ఆటల పోటీల్లో జరిగిన తొమ్మిదో తరగతి విద్యార్థులు పాల్గొన్నారు.మొదటిగా అర్సియా,రెండవ స్థానంలో మైథిలి,మూడవ స్థానంలో సాయి తేజస్విని మధ్య ప్రతిభను కనబరిచారని అదేవిధంగా వీరు ముగ్గురు ప్రపంచ స్థాయిలో జరిగే ఆటల పోటీల్లో పాల్గొనేందుకు ఎంపిక అయినట్లు పాఠశాల ఎస్ఓ విజయలక్ష్మి,పిఈటి సుమలత తెలిపారు.పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచినందుకుగాను విద్యార్థులకు అక్కడ అందజేసిన సర్టిఫికెట్లను మంగళవారం కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులకు వారు సర్టిఫికెట్లను అందజేశారు.

About Author