NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కేసీఆర్ అవినీతి 9 ల‌క్ష‌ల కోట్లు.. సీబీఐకి ఫిర్యాదు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు కేఏ పాల్ సీబీఐకి ఫిర్యాదు చేశారు. సీఎం కేసీఆర్‌, ఆయన కుటుంబ సభ్యులు తెలంగాణలో రూ.9 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని కేఏ పాల్‌ ఆరోపించారు. ఈ మేరకు ఢిల్లీలో సీబీఐ డైరెక్టర్‌ సుబోద్‌ కుమార్‌ జైశ్వాల్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం కేఏ పాల్‌ మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి అవినీతి చూడలేదని, తెలంగాణ ప్రజలంతా సీఎం కేసీఆర్ అవినీతిపై విచారణ జరగాలని కోరుతున్నారని తెలిపారు. కేసీఆర్ కుటుంబానికి ఆదాయానికి మించి ఉన్న ఆస్తులపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.

                                          

About Author