PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఈట‌ల మీద విచార‌ణ‌కు ఆదేశించిన కేసీఆర్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ మీద భూక‌బ్జా ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో విచార‌ణ‌కు సీఎం కేసీఆర్ ఆదేశించారు. మెద‌క్ జిల్లాలోని అచ్చంపేట‌, హ‌కీం పేట‌లో 100 ఎక‌రాల అసైన్డ్ భూమిని మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ క‌బ్జా చేశార‌ని కొంద‌రు రైతులు కేసీఆర్ కు ఫిర్యాదు చేశారు. ఈ విష‌యం మీద స్పష్టమైన నివేదిక ఇవ్వాల‌ని అధికారుల‌ను కేసీఆర్ ఆదేశించారు. క‌లెక్టర్ తో విచార‌ణ జ‌రిపించాల‌ని సీఎస్ సోమేష్ కుమార్ ను ఆదేశించారు. నిజానిజాలు నిగ్గుతేల్చాల‌ని విజిలెన్స్ డీజీ పూర్ణచంద‌ర్ రావును ఆదేశించారు. స‌త్వర‌మే ప్రాథ‌మిక విచార‌ణ జ‌రిపించి నివేదిక ఇవ్వాల‌ని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

About Author