PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మోదీకి వ్య‌తిరేకంగా వార‌ణాసిలో కేసీఆర్ మ‌కాం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీ పై పోరు వేగ‌వంతం చేశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో భేటీ కావడంతోపాటు, యూపీ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంటారని సమాచారం. ప్రధాని నరేంద్రమోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి సెగ్మెంట్‌లోనే కేసీఆర్ ప్రచారం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేస్తామంటూ గతంలో సీఎం కేసీఆర్‌తో పాటు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంకేతాలిచ్చారు. వారణాసి లోక్ సభ స్థానం పరిధిలో ఈ నెల 7న ఏడో విడత యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ నెల 4న అక్కడ ఎన్నికల ప్రచారానికి కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ, ఎన్సీపీ నేత శరద్ పవర్ వెళ్లే అవకాశాలున్నాయి. వారితో పాటు కేసీఆర్ కూడా వారణాసి ఎన్నికల ప్రచారానికి వెళ్లే అవకాశముందని తెలుస్తోంది.

                                     

About Author