NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

యశోధ ఆసుపత్రికి కేసీఆర్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు యశోద ఆసుపత్రికి వెళ్లారు. కరోనా పాజిటివ్ తర్వాత ఆసుపత్రికి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కు క‌రోన సోకింది. వైద్య ప‌రీక్షల్లో పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది. కొన్న రోజులుగా క‌రోన ల‌క్షణాల‌తో బాధ‌ప‌డుతుండ‌టంతో ఆయ‌న వైద్య ప‌రీక్షలు చేయించుకున్నారు. వైద్య ప‌రీక్షల అనంత‌రం కోవిడ్ పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయ‌న క్వారంటైన్ లోకి వెళ్లారు. వైద్యులు సూచ‌న మేర‌కు చికిత్స తీసుకున్నారు. ఎర్రవెల్లి ఫాంహౌస్ లో హోం ఐసోలేషన్ లో ఉన్నారు. డాక్టర్లు సూచన మేరకు ఆసుపత్రికి చేరుకొని చికిత్స పొందుతున్నారు.

About Author