PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆటో డ్రైవర్ ఆతిథ్యం స్వీకరించిన ముఖ్యమంత్రి

1 min read


ల్లెవెలుగు వెబ్: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్‌లోనూ పాగా వేయాలని చూస్తున్నారు. త్వరలో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పంజాబ్‌లో పర్యటించారు. లూథియానాలో ఎన్నికల ప్రచారంలో ఉన్న కేజ్రీవాల్‌కు అరుదైన ఆహ్వానం లభించింది. ఓ ఆటో డ్రైవర్ తన ఇంటికి భోజనానికి రావాల్సిందిగా సీఎంకు విజ్ఞప్తి చేశారు. అతడి ఆహ్వానాన్ని మన్నించారు కేజ్రీవాల్‌… స్వయంగా అతడి ఆటోలోనే డ్రైవర్‌ ఇంటికి వెళ్లారు. అతడితో పాటు నేలపై కూర్చుని భోజనం చేసి ఆటోడ్రైవర్‌ను సంతోషపెట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి.

About Author