NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రైవేటు వ్యక్తి  చేతుల్లో  కీలక ..ఫైళ్లు

1 min read

పల్లెవెలుగు వెబ్​, మహానంది: కర్నూలు జిల్లా మహానంది మండల పరిషత్ కార్యాలయంలో ఓ ప్రైవేటు వ్యక్తి చేతుల్లో కీలక ఫైళ్లు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.  మండలం లోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి వచ్చే వినతులు మరియు కీలక సమాచారం మొత్తం ఆ ప్రైవేటు వ్యక్తి కనుసన్నల్లో నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి వృద్ధులు, వితంతువుల పెన్షన్ల మంజూరు మరియు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కీలక అంశాలకు సంబంధించి మొత్తం ప్రైవేట్ వ్యక్తి కనుసన్నల్లో జరుగుతున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి .సాధారణ పౌరులు మండల పరిషత్ కార్యాలయానికి వెళితే ప్రైవేటు వ్యక్తి తన హవా ప్రదర్శిస్తూ ఉన్నట్లు తెలుస్తుంది. ప్రతి పంచాయతీ కార్యదర్శి కానీ సర్పంచులు కానీ ఎవరైనా పనులు జరగాలంటే సదరు వ్యక్తిని  ఆశ్రయించాల్సిందేనని కొందరు సర్పంచ్​లు బహిరంగంగానే చెప్పుకొస్తున్నారు. మహానంది మండలం లో ఉన్నటువంటి ప్రతి గ్రామపంచాయతీ వంతుల వారీగా ఆ ప్రైవేటు వ్యక్తి నిర్ణయించిన విధంగానే పారితోషికం చెల్లించేలా ఆదేశాలు జారీ చేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ప్రైవేటు వ్యక్తి మండల పరిషత్ కార్యాలయంలో కీలక భూమిక పోషిస్తూ ఉన్నట్లు ఆరోపణలు వినవస్తున్న అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తూ అతనికి వత్తాసు పలుకుతున్న ట్లు సమాచారం.

About Author