PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ర‌ష్యా, ఉక్రెయిన్ మ‌ధ్య కీల‌క ప‌రిణామం.. యుద్ధం ఆగేనా ?

1 min read

పల్లెవెలుగువెబ్ : ఉక్రెయిన్ , ర‌ష్యా మ‌ధ్య జ‌రిగిన చ‌ర్చ‌ల్లో కీల‌క ముంద‌డుగు ప‌డింది. మంగళవారం రోజున ఇస్తాంబుల్‌లో జరిగిన ఉక్రెయిన్‌- రష్యా మధ్య శాంతి చర్చల్లో పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. శాంతి చర్చల్లో విశ్వాసాన్ని పెంచడానికి కీవ్‌, చెర్నీవ్‌ నుంచి బలగాలను వెనక్కి తీసుకుంటామని రష్యా ప్రకటించింది. పరస్పర విశ్వాసం, తదుపరి చర్చలు జరగడానికి అవసరమైన పరిస్థితుల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారి అలెగ్జాండర్ ఫోమిన్ తెలిపారు. రష్యా ప్రతినిధి బృందం మాస్కోకు తిరిగొచ్చిన తర్వాత ఇస్తాంబుల్‌లో చర్చించిన విషయాలు, తీసుకున్న నిర్ణయాలను మరింత విపులంగా వెల్లడిస్తామని రష్యా జనరల్ స్టాఫ్ ఫోమిన్ చెప్పారు.

                                  

About Author