NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కేజీ రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు : నందికొట్కూరు పట్టణంలోని కేజీ రోడ్డు విస్తరణ పనులు త్వరగా పూర్తిచేసి ట్రాఫిక్ అంతరాయం లేకుండా మధ్యలో డివైడర్ ఏర్పాటు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) పట్టణ కార్యదర్శి ఎం శ్రీనివాసులు సంబంధిత అధికారులను కోరారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పట్టణంలో కేజీ రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణాలను తొలగించి దాదాపు 8 సంవత్సరాలు అవుతున్న విస్తరణ పనులు మాత్రం నత్తనడకన కొనసాగుతున్నాయని రోడ్ విస్తరణ పనులు పూర్తి కాకపోవడం వల్ల, ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉండడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని, ప్రయాణికులు చేరవలసిన గమ్యస్థానాలకు ట్రాఫిక్ అంతరాయం వల్ల తగిన సమయానికి వెళ్లలేక  ఇబ్బందులకు పడుతున్నారని అధికారులు చొరవ తీసుకొని కేజీ రోడ్డు విస్తరణ పనులు జాప్యం చేయకుండా త్వరగా పూర్తి చేసి ట్రాఫిక్ అంతరాయం లేకుండా, వాహనదారులు ప్రమాదాలకు గురికాకుండా డివైడర్ ఏర్పాటు చేయాలనీ డిమాండ్ చేశారు లేని పక్షంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలతో కలిసి ఉద్యమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఐ పగిడ్యాల మండల కార్యదర్శి అబ్దుల్ మజీద్,  పట్టణ నాయకులు మధు, రాజు,ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు మహానంది ,దినేష్ వినోద్ తదితరులు పాల్గొన్నారు.

About Author