PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కియా ఇండియా ఒక మిలియన్ ప్రొడక్షన్ యూనిట్స్ సంబరాలు

1 min read

పల్లెవెలుగు వెబ్ రాజమండ్రి : తమ సరికొత్త ఆవిష్కరణ – ద న్యూ సెల్టోస్ మొదటి యూనిట్ ను విడుదల చేసిన కియా ఇండియా, తమ భవిష్య తయారీ సదుపాయం అనంతపురం నుండి ఒక మిలియన్ వాహనాలను పంపిణీ చేసిన చారిత్రక మైలురాయిని సంబరం జరుపుకుంది. భారతదేశంలో లభించబోయే అత్యంత అభివృద్ధి చెందిన, సురక్షితమైన, స్మార్టర్ ఎస్ యూవీలలో ఒకటైన కొత్త సెల్టోస్ ప్రొడక్షన్ ఆరంభానికి కూడా ఈ సంబరం గుర్తుగా నిలిచింది. కొత్త సెల్టోస్ ఆధునిక డిజైన్, 17 ఫీచర్స్ తో  అత్యంత ఆధునికమైన లెవెల్ 2 ఏడీఏఎస్, ఎంతగానో ఎదురుచూసిన పనోరమిక్ సన్ రూఫ్ సహా 32 భద్రతా ఫీచర్స్ తో లభిస్తోంది. ఇది జులై 14 నుండి ప్రీ-బుక్కింక్స్ కోసం అందుబాటులోకి వచ్చింది.

About Author