కిక్ బాక్సర్లను ప్రోత్సహిద్దాం..
1 min read
ఏప్రిల్ 5న జరిగే రాష్ట్రస్థాయి కిక్ బాక్సింగ్ పోటీలను విజయవంతం చేద్దాం
- త్రినాథ్ కిక్ బాక్సింగ్ అకాడమి అధ్యక్షులు, అమ్మ హాస్పిటల్ అధినేత డాక్టర్ త్రినాథ్
కర్నూలు, న్యూస్ నేడు: ఏప్రిల్ 5 నుంచి 6 వరకు కర్నూలు నగరంలో రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్, జూనియర్,సీనియర్ విభాగాలలో కిక్ బాక్సింగ్ పోటీలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కిక్ బాక్సింగ్ సంఘం కార్యదర్శి నరేంద్ర ఆచారి తెలిపారు. ఈ సందర్భంగా శనివారం నగరంలోని త్రినాథ్ కిక్ బాక్సింగ్ అకాడమిలో రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలకు సంబంధించి బ్రోచర్ ను త్రినాథ్ కిక్ బాక్సింగ్ అకాడమి అధ్యక్షులు డాక్టర్ త్రినాథ్, డాక్టర్ శశివర్ధన్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ త్రినాథ్ మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించడం అందరి బాధ్యత అన్నారు.కర్నూల్లో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలకు తమ వంతు సహాయ సహకారాలను అందిస్తామన్నారు. క్రీడాకారుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తామన్న డా. త్రినాథ్… రాష్ట్ర స్థాయి పోటీలో కర్నూలు కిక్ బాక్సర్లు విజయం సాధించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.