కిడ్నీల ఆరోగ్యంపై అవగాహన అవసరం…
1 min read
బీపీ,షుగర్, ఊబకాయం వ్యాధిగ్రస్తులు జాగ్రత్తలు పాటించాల్సిందే..
- ప్రారంభదశలో చికిత్స కు వస్తే.. సేఫ్..
- నెఫ్రాలజిస్ట్ డా. రవికుమార్
- ‘ జెమ్ కేర్ కామినేని’లో.. కిడ్నీ స్ర్కీనింగ్ కు స్పెషల్ ప్యాకేజీ
కర్నూలు, న్యూస్ నేడు: కిడ్నీల ఆరోగ్యంపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, లేదంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుందన్నారు జెమ్ కేర్ కామినేని హాస్పిటల్ ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డా. రవి కుమార్. కిడ్నీలను సంరక్షించుకునేందుకు ‘ జెమ్ కేర్ కామినేని హాస్పిటల్ లో మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తున్నామన్నారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా గురువారం నగరంలోని జెమ్ కేర్ కామినేని హాస్పిటల్ లో కిడ్నీ డే వేడుకలు నిర్వహించారు. హాస్పిటల్ సీఈఓ, ఎం.డి డా. చంద్ర శేఖర్ నేతృత్వంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నెఫ్రాలజిస్ట్ డా. రవి కుమార్, డా. సతీష్ కేక్ కట్ చేసి హాస్పిటల్ సిబ్బందికి, రోగులకు, వారి బంధువులకు పంచారు. ఈ సందర్భంగా కిడ్నీ లను కాపాడుకునేందుకుగాను స్క్రీనింగ్ టెస్టుల కోసం రూ.3180 అయ్యే ఖర్చు కు రూ.499 మాత్రమే ప్రత్యేక ప్యాకేజికి సంబంధించిన వోచర్ను విడుదల చేశారు. అనంతరం జెమ్ కేర్ కామినేనిలో 35 మంది డయాలసిస్ట్ పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. వారిలో రెగ్యులర్ పేషెంట్లను సన్మానించారు. ఈ సందర్భంగా నెఫ్రాలజిస్ట్ డా. రవి కుమార్ మాట్లాడుతూ మందు, మద్యం, పొగ తాగడం వంటి వాటికి దూరంగా ఉండాలని, ప్రతి రోజు వ్యాయామం చేస్తే కిడ్నీల ఆరోగ్యం సురక్షితంగా ఉంటుందన్నారు. మధుమేహం, రక్తపోటు, ఊబకాయం వ్యాధిగ్రస్తులకు కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంటుందని, వారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జెమ్ కేర్ కామినేని హాస్పిటల్ ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ మార్చి 13 నుంచి ఏప్రిల్ 13 వరకు మాత్రమే ఉంటుందన్నారు. ప్యాకేజీలో భాగంగా ఆర్బిఎస్, సిబిపి, సియూఈ, సెరమ్ క్రిటినిన్, అబ్డమెన్ అల్ర్టా సౌండ్ తోపాటు నెఫ్రాలజి వైద్యులు ఉచితంగా ఓపీ చూస్తారని ఈ సందర్భంగా నెఫ్రాలజిస్ట్లు డా. రవి కుమార్, డా. సతీష్ వెల్లడించారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఆర్థో పెడిక్ వైద్యులు డా. రవి బాబు , ఎమర్జెన్సీ హెడ్ డా. రామ్మోహన్, న్యూరాలజిస్ట్ డా. నిషాన్ , సీఈఓ డా. గణేష్ , ఏజీఎం డా. కృష్ణ, నదీమ్ జిఎం ఆపరేషన్ , రమణ డిజే మార్కెటింగ్ తదితరులు పాల్గొన్నారు.
