NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కిలో మ‌ట‌న్ రూ. 50.. ఆశ్చ‌ర్య‌పోతున్నారా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : గొర్రెలు, మేక‌ల పెంప‌కం త‌గ్గ‌డంతో మాంసం ధ‌ర‌లు నానాటికి పెరిగిపోతున్నాయి. సామాన్యుడు కొన‌లేని స్థితిలో మాంసం ధ‌ర‌లు ఉన్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఓ మాంసం దుకాణ‌దారుడు కిలో రూ.50 కే కిలో మాంసాన్ని అమ్మ‌డం అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. చిత్తూరు జిల్లా పీలేరులోని వాల్మీకీ పురంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. గాంధీ బస్టాండు వద్ద ఉన్న ఒక దుకాణదారుడు కిలో రూ.300 బేరం సాగించాడు. దీంతో ఇతర దుకాణదారులు పోటీలు పడి రూ.200లు, రూ.100 అంటూ తగ్గించారు. చివరకు ఒక దుకాణాదారుడైతే కేవలం రూ.50లకు ధర పెట్టాడు. రాత్రి ఏడున్నరకు స్టాకు పూర్తయిపోయింది. దుకాణదారుల పోటీయే ధర తగ్గడానికి కారణంగా చెబుతున్నారు. కాగా చికెన్‌ మాత్రం కిలో రూ.160 వంతున అమ్మకాలు సాగాయి.

                                       

About Author