PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కింగ్ అనుకున్న వారు జైల్లో ఉన్నారు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సీఐఐ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన స‌మావేశంలో ప్ర‌ముఖ ఇన్వెస్ట‌ర్ రాకేష్ ఝున్ ఝున్ వాలా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. స్టాక్‌ మార్కెట్లో మనమే కింగ్‌ అని కాలర్‌ ఎగరేసినవారు ప్రస్తుతం ఆర్థర్‌ రోడ్‌ జైల్లో ఉన్నారని ప్రముఖ ఈక్విటీ ఇన్వెస్టర్‌, బిగ్‌ బుల్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా అన్నారు. మార్కెట్‌కు ఎవరూ కింగ్‌ కాదని, మార్కెట్టే రారాజని అన్నారు. వాతావరణం, మరణం, మహిళ, మార్కెట్‌ను ఖచ్చితంగా అంచనా వేయడం ఎవరివల్లా కాదన్నారు. స్టాక్‌ మార్కెట్లను ఆయన మహిళతో పోల్చారు. ‘‘మహిళల్లాగే మార్కెట్‌దే ఎప్పుడూ పైచేయి. అంతేకాదు, అంచనాకు అందదు. పైగా అనిశ్చితం, అస్థిరం. నీవెప్పటికీ మహిళపై ఆధిపత్యం చలాయించలేవు. అలాగే మార్కెట్‌పైన కూడా’’ అని అభిప్రాయపడ్డారు.

                                  

About Author