PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అమ‌రావ‌తి రైతుల‌కు ‘కోదండ‌రామ్’ మ‌ద్దతు !

1 min read

పల్లెవెలుగు వెబ్​: అమ‌రావ‌తి రైతులు చేప‌ట్టిన మ‌హాపాద‌యాత్రకు తెలంగాణ జ‌న‌స‌మితి అధ్యక్షుడు ప్రొఫెస‌ర్ కోదండ‌రామ్ మ‌ద్దతు తెలిపారు. విజ‌య‌వాడ‌లో జ‌రిగిన ఓ కార్యక్రమంలో ప్రొఫెస‌ర్ కోదండ‌రామ్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా రైతు ఐకాస నేత‌లు కోదండ‌రామ్ ను క‌లిశారు. న‌వంబ‌ర్ 1 నుంచి న్యాయ‌స్థానం టు దేవ‌స్థానం పేరిట అమ‌రావ‌తి రైతులు పాద‌యాత్ర చేప‌ట్టారు. ప్రస్తుతం తాను హాజ‌రుకాలేనని, వీలు చూసుకుని పాల్గొంటాన‌ని తెలిపారు. అమ‌రావ‌తి విష‌యంలో గ‌తంలో ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంద‌ని, దాని మేర‌కు రైతులు భూములిచ్చార‌ని తెలిపారు. ఇప్పడు రైతుల ప్రమేయం లేకుండా రాజ‌ధాని త‌ర‌లించ‌డం స‌రైందికాద‌న్నారు. రైతుల‌తో చ‌ర్చించి వారి స‌మ‌స్యలు తీర్చే విధంగా నిర్ణయం తీసుకోవాల‌ని సూచించారు.

About Author