PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మిస్ట‌రీగా మారిన కోడిక‌త్తి కేసు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సీఎం జ‌గ‌న్ పై టీడీపీ నేత ధూళిపాళ్ల న‌రేంద్ర తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. కోడికత్తి, బాబాయ్ గొడ్డలిపోటు ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయని, దీన్ని బట్టే జగన్ విశ్వసనీయత ఏమిటో అర్థమవుతోందని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రావణుడి వలే జగన్‌కూ 10 అవినీతి తలలు ఉన్నాయన్నారు. అదానీకి మేలుచేయడానికి విద్యుత్ రంగాన్ని.. సీఎం నాశనం చేస్తున్నారని అధికారులే వాపోయారన్నారు. మూడేళ్లలో రాష్ట్రంలో 1500 మంది ఆడబిడ్డలపై అఘాయిత్యాలు జరిగినా..15 మంది నిందితులకు కూడా శిక్షపడలేదని ధూళిపాళ్ల నరేంద్ర తీవ్రస్థాయిలో విమర్శించారు.

                                            

About Author