PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అదాని చేతికి కోహినూర్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అదానీ విల్మార్ ‘కోహినూర్’ సహా పలు బ్రాండ్‌లను కొనుగోలు చేసింది. భారతదేశంలో కోహినూర్ బ్రాండ్ కింద ‘రెడీ టు కుక్’, ‘రెడీ టు ఈట్’ కూరలు, మీల్స్ పోర్ట్‌ఫోలియో సహా ‘కోహినూర్’ బ్రాండ్ బాస్మతి రైస్‌పై ఏడబ్ల్యూఎల్ ప్రత్యేక హక్కులు లభిస్తాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కోహినూర్ బ్రాండ్ పోర్ట్‌ఫోలియోలో ‘కోహినూర్’ – ప్రీమియం బాస్మతి బియ్యం, ‘చార్మినార్’ బియ్యం సహా హొరేకా విభాగాలున్నాయి. ఆహార వ్యాపారంలో తన ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు మెక్‌కార్మిక్ స్విట్జర్లాండ్ జీఎంబీహెచ్ నుండి ప్రముఖ ‘కోహినూర్’ బ్రాండ్‌ సహా పలు బ్రాండ్‌లను కొనుగోలు చేస్తున్నట్లు అదానీ విల్మార్ లిమిటెడ్ మంగళవారం ప్రకటించింది.

                                               

About Author